అమృత్సర్: పంజాబ్లో కెప్టెన్ అమరీందర్సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్సింగ్ సిద్ధూ ( Navjot Sidhu ) మరోసారి విమర్శలు గుప్పించారు. పంజాబ్లో తమ సొంత ప్రభుత్వంపై సిద్ధూ గతంలో కూడా పలుమార్లు విమర్శలు చేశారు. దాంతో సిద్ధూకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వొద్దని అమరీందర్సింగ్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి మొరపట్టుకున్నారు. కానీ సోనియా అమరీందర్ మాటను లెక్కచేయకుండా సిద్ధూకే పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టింది.
ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి సిద్ధూ.. అమరీందర్ సర్కారును ఇరుకునపెట్టే కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో చెరుకు రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన అవరముందని ట్వీట్ చేశారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే పంజాబ్లోనే చెరుకు సాగు ఎక్కువగా జరుగుతున్నదని.. కానీ హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో పోల్చితే పంజాబ్లో చెరుకుపంటకు మద్దతు ధర చాలా తక్కువగా ఉండటం ఆశ్చర్యకరమని సిద్ధూ ట్విట్టర్లో పేర్కొన్నారు.