చండీఘడ్: పంజాబ్లోని ఫిరోజ్పూర్లో ఉన్న లిక్కర్ కంపెనీని మూసివేయాలని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఆ లిక్కర్ కంపెనీ వల్ల స్థానికంగా పర్యావరణ సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పంజాబ్ గాలిని కలుషితం చేసే హక్కు ఎవరికీ లేదని, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాత తమ ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు దృష్ట్యా జీరా లిక్కర్ ఫ్యాక్టరీ మూసివేతకు ఆదేశాలు జారీ చేసినట్లు సీఎం మాన్ తెలిపారు.
భవిష్యత్తులోనూ ఎవరైనా ఇక్కడి వాతావరణాన్ని కలుషితం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. జీరాలోని ఇథనాల్ ప్లాంట్ నుంచి విడుదల అవుతున్న వ్యర్ధాలతో కలుషితం పెరుగుతున్నట్లు రైతు సంఘాలు నిరసన చేస్తున్నాయి. ఈ అంశంలో సీఎం మాన్కు లేఖ కూడా రాశారు. ఫ్యాక్టరీ వల్ల భూగర్భ జలాలు, గాలి, పర్యావరణం అన్నీ కలుషితం అవుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.