చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ తనదైన స్టైల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బర్నాలాలోని అస్పాల్ ఖుర్ద్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులతో ఆయన మమేకమయ్యారు. తొలుత సీఎం చన్నీ యువకులతో సరదాగా క్రికెట్ ఆడారు. అనంతరం కొంత మంది వృద్ధులతో కలిసి పేకాట ఆడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఈ నెల 20న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలకు ముందు అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చరణ్జిత్ సింగ్ చన్నీనే సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పార్టీ ఎలక్షన్ కమిటీ చైర్మన్గా ఎంపీ రవ్నీత్ సింగ్ బిట్టూను నియమించింది.
మరోవైపు సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగాలని ఆశించిన పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధూకు నిరాశ ఎదురైంది. రాహుల్ గాంధీ ఇటీవల సిద్దూ సమక్షంలోనే చరణ్జిత్ సింగ్ చన్నీని సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. అయితే సీఎం అయినా, కాకపోయినా సిద్ధూ ఎప్పటికీ హీరోనే అని ఆయన భార్య కౌర్ మీడియాతో అన్నారు.
#WATCH Punjab Chief Minister Charanjit Singh Channi played cricket and cards with locals during his campaign in Aspal Khurd in Barnala today pic.twitter.com/6eUcCO8rTG
— ANI (@ANI) February 9, 2022