చండీగఢ్: మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబ సభ్యులకు పంజాబ్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది. 11 మంది రైతు కుటుంబ సభ్యులకు పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ క్లర్క్ నియామక పత్రాలను అందజేశారు. ఈ మేరకు సీఎం కార్యాలయం శనివారం ప్రకటించింది. కాగా, మూడు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపైగా రైతులు చేపట్టిన ఆందోళనలతో దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల వాటిని రద్దు చేస్తూ చట్టం తెచ్చింది. ఈ నేపథ్యంలో నిరసనలకు ముగింపు పలికిన రైతులు శనివారం నుంచి తమ ఇండ్లకు తిరుగు ప్రయాణమవుతున్నారు.