చండీగఢ్, జూలై 6: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాన్ గురువారం వివాహం చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకులు ధ్రువీకరించారు. ‘గురువారం ఇక్కడ ఓ ప్రైవేటు వేడుకలో మాన్ సాబ్ వివాహం జరుగనున్నది. ఆయన డాక్టర్ గురుప్రీత్ కౌర్ మెడలో మూడుమూళ్లు వేయబోతున్నారు. ఆమె ఆప్ సీనియర్ నేత, పార్టీ పంజాబ్ శాఖ ముఖ్య అధికార ప్రతినిధి’ అని తెలిపారు. 2015లో మొదటి భార్యతో విడిపోయిన తర్వాత మాన్కు ఇది రెండో వివాహం. మొదటి భార్య నుంచి ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.