చండీగఢ్, జూలై 21: పంటల మద్దతు ధరపై కమిటీ ఏర్పాటులో పంజాబ్ను కేంద్రం విస్మరించడంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తీవ్రంగా మండిపడ్డారు. పంజాబ్పై, రాష్ట్ర రైతులపై బీజేపీ నేతృత్వంలోని కేంద్రం వివక్ష చూపిందని ఆరోపించారు. తమ రాష్ట్ర రైతులు అభిప్రాయాలు చెప్పుకోవడానికి కనీసం అవకాశం కూడా కల్పించపోతే ఎలా.. అని ప్రశ్నించారు. 26 మందిలో ఒక్కరిని కూడా పంజాబ్ నుంచి తీసుకోకపోవడంపై ఆ రాష్ర్టానికి చెందిన ఎంపీలు విక్రమ్జిత్ సింగ్ సాహ్ని, రాఘవ్ చద్దా అభ్యంతరం వ్యక్తం చేశారు.