న్యూఢిల్లీ: ఇక నుంచి గుర్బానీ(Gurbani) ప్రసారాలు ఉచితంగా జరగనున్నాయి. దీని కోసం పంజాబ్ అసెంబ్లీ ఇవాళ సిక్కు గురుద్వారాల సవరణ బిల్లు 2023కి ఆమోదం తెలిపింది. అమృత్సర్లోని స్వర్ణదేవాలయం నుంచి గుర్బానీ ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. టెండర్తో పని లేకుండా గుర్బానీ అందరికీ ఉచితంగా బ్రాడ్కాస్ట్ అవుతుందని అసెంబ్లీలో సీఎం భగవంత్మాన్ సింగ్ తెలిపారు. సిక్కు గురువులు, రైటర్లు కంపోజ్ చేసిన పవిత్ర కీర్తనలను గుర్బానీ అంటారు.
బ్రిటీష్ కాలం నాటి సిక్కు గురుద్వారా చట్టం 1925కి తాజా ప్రభుత్వం సవరణలు చేసింది. దానికి సోమవారం రోజున క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆ తర్వాతే ఇవాళ అసెంబ్లీలో ఆ బిల్లును పాస్ చేశారు. దీంతో గుర్బానీ ప్రసారాలపై ఉన్న పీటీసీ టీవీ ఛానల్ హక్కుల ఆధిపత్యానికి బ్రేక్ పడనున్నది. సిక్కు మత ప్రచారాకులపై ఉన్న నియంత్రణను సవరణ చట్టం తొలగించనున్నది. సెక్షన్ 125ఏ సవరణ ద్వారా ఇక నుంచి గుర్బానీ ప్రసారాలు ఉచితంగా జరగనున్నాయి.
గుర్బానీ అనేది సిక్కుల పవిత్ర శ్లోకం. స్వర్ణదేవాలయంలో పఠించే ఈ శ్లోకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు భక్తిశ్రద్ధలతో ఆలకిస్తారు. ఈ శ్లోకం ప్రసార హక్కులు ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఛానల్ దగ్గర మాత్రమే ఉన్నాయి. ఈ ప్రసార హక్కులను ఒక ఛానల్కే పరిమితం చేయకుండా అందరికీ అందుబాటులో ఉండేలా ఉచితంగా ప్రసారం చేయాలని పంజాబ్ సర్కారు నిర్ణయించింది.