చండీగఢ్: తమ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ లంచం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై పంజాబ్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. తమ పార్టీని పడగొట్టేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలపై విచారణ జరుపాలని ఆప్ కోరింది.
పార్టీకి చెందిన కనీసం పది మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికీ రూ.25 కోట్లు ఆఫర్ చేసిందని ఆరోపించింది. ఢిల్లీలో బీజేపీ సర్కారు చేపట్టిన ‘ఆపరేషన్ లోటస్’ విఫలమైందని పంజాబ్ సీఎం భగవంత్మాన్ పేర్కొన్నారు.