ముంబై: మహారాష్ట్రలోని పూణే విమానాశ్రయాన్ని ఈ నెల 16 నుంచి 14 రోజులపాటు మూసివేయనున్నారు. విమానాశ్రయంలోని రన్ వే అక్టోబర్ 15 రాత్రి 8 గంటల నుంచి అక్టోబర్ 29 వరకు మూసి ఉంటుందని, 30వ తేదీ ఉదయం 8 గంటల నుంచి విమాన సర్వీసులను పునరుద్ధిస్తామని పూణే ఎయిర్ పోర్ట్ అధికారులు ప్రకటించారు. రన్ వే రీ సర్వీసింగ్ పనులను ఎయిర్ ఫోర్స్ చేపడుతుందని, ఈ నేపథ్యంలో 14 రోజుల పాటు రన్ వే మూసి ఉంటుందని తెలిపారు.
మరోవైపు దసరా, దీపావళి వంటి ముఖ్యమైన పండగల సమయంలో వాణిజ్యపరంగా కీలకమైన పూణే ఎయిర్ పోర్ట్ మూసివేతపై విమానయాన సంస్థలు తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశాయి. ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.
కాగా, ఐఏఎఫ్ శిక్షణ కేంద్రంలోనే పూణే ఎయిర్పోర్టును నిర్వహిస్తున్నారు. భూసేకరణ సమస్యల నేపథ్యంలో పురందర్లో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు.