లక్నో: ‘మా పార్టీ జెండా తొలగిస్తే.. మీ బ్యాడ్జ్ పీకేస్తా’ అని పోలీస్ అధికారిని ఎస్పీ నేత బెదిరించాడు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ ఘటన జరిగింది. బీజేపీ కొత్త ప్రాంతీయ కార్యాలయం నిర్మాణానికి వ్యతిరేకంగా సమాజ్వాదీ పార్టీ పోస్టర్లు అంటించింది. బీజేపీ కార్యాలయం నిర్మించిన స్థలాన్ని ఆస్పత్రి నిర్మాణం కోసం నౌబస్తా మౌరంగ్ మండి నుంచి సేకరించారని అందులో పేర్కొన్నారు. అయితే బీజేపీ అక్కడ తన కార్యాలయాన్ని నిర్మించిందని ఆరోపించారు.
మరోవైపు మంగళవారం బీజేపీ కార్యాలయాన్ని సీఎం యోగి, జేపీ నడ్డా ప్రారంభించాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ పోస్టర్ను తొలగించగా సమాజ్వాదీ యువజన సభ కాన్పూర్ రూరల్ జిల్లా అధ్యక్షుడు అర్పిత్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు పోలీసులను అడ్డుకోబోయారు. దీంతో ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో బర్రా పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అజయ్ సేథ్, ఆయనకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా ‘తమ జెండాను తొలగిస్తే… నేను మీ బ్యాడ్స్ను పీకేస్తాను’ అని అర్పిత్ యాదవ్ అన్నారు. పోలీస్ అధికారిని ఆయన బెదిరించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, పోలీస్ విధులను అడ్డుకోవడంతోపాటు పోలీస్ అధికారిని బెదిరించిన ఎస్పీ నేత అర్పిత్ యాదవ్పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ అజయ్ సేథ్ తెలిపారు.
https://www.facebook.com/watch/live/?ref=watch_permalink&v=413080727210392