న్యూఢిల్లీ: రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ను తొలగించాలని మహిళా రెజ్లర్లు ఢిల్లీలో ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ రెజ్లర్లు క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడుతున్నారని, కమిటీ రిపోర్టు ఇచ్చే వరకు రెజ్లర్లు ఆగలేదని, నెగటివ్ పంథాలో ధర్నాచేస్తున్నట్లు భారతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష విమర్శించారు. ధర్నా చేస్తున్న అథ్లెట్లను విమర్శించిన పీటీ ఉషపై కాంగ్రెస్ నేత, ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) కామెంట్ చేశారు. లైంగిక వేధింపులకు గురైన అథ్లెట్లు ధర్నా చేస్తుంటే, వారి గురించి తక్కువగా మాట్లాడడం అవమానకరంగా లేదా అని శశిథరూర్ ప్రశ్నించారు. రెజ్లర్లు వాళ్ల హక్కుల కోసం పోరాటం చేయడం వల్ల దేశ ప్రతిష్టకు నష్టం కలగదా అని అడిగారు. రెజ్లర్ల ఆందోళనల్ని పట్టించుకోవడం లేదని, వారి బాధలు వినకుండా.. విచారించడం సరికాదు అని ఎంపీ శశి తన ట్వీట్లో తెలిపారు.
Dear @PTUshaOfficial, it is does not become you to disparage the justified protests of your fellow sportspersons in the face of repeated & wanton sexual harassment. Their standing up for their rights does not “tarnish the image of the nation”. Ignoring their concerns — instead of…
— Shashi Tharoor (@ShashiTharoor) April 28, 2023