పీఎస్ఎల్వీ మరోసారి ఇస్రో నమ్మకాన్ని నిలబెట్టుకొని విజయవంతమైంది. శనివారం శ్రీహరి కోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ55 సింగపూర్కు చెందిన రెండు ఉపగ్రహాలను అనుకున్న కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
ఈ ఉప గ్రహాలు రాత్రి, పగటి వేళల్లో స్పష్టమైన ఫొటోలు తీయగలవు. హైదరాబాద్ స్టార్టప్ ధృవ స్పేస్ ఈ ప్రయోగం ద్వారా శాటిలైట్ డెప్లాయర్లను, రేడియో ఫ్రీక్వెన్సీ మాడ్యూళ్లను పరీక్షించింది.