POK | న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) నిరసనలతో హోరెత్తుతున్నది. భారత్లో కలిసిపోతామంటూ అక్కడి ప్రజలు పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. గిల్గిట్ బాల్టిస్థాన్ సహా పలు చోట్ల వేలాదిమంది ప్రజలు వీధుల్లోకి వచ్చి పాకిస్థాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. గత వారం రోజులుగా రహదారుల్ని దిగ్బంధం చేస్తున్నారు. పీవోకేలో పాకిస్థాన్ ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్లు, విద్యుత్తు, తాగునీరు వంటి కనీస వసతులు కల్పించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.