న్యూఢిల్లీ, నవంబర్ 2: ఢిల్లీ యూనివర్సిటీ ఇంగ్లిష్ విభాగం పీహెచ్డీ కోర్సు ఫీజును ఒకేసారి ఏకంగా 12 రెట్లు పెంచడంపై విద్యార్థులు, అధ్యాపకులు నిరసన వ్యక్తం చేశారు. గత ఏడాది వరకు రూ.1,932గా ఉన్న ఫీజును యూనివర్సిటీ రూ. 23,968కి పెంచింది. మిగతా సబ్జెక్టుల పీహెచ్డీ ప్రొగ్రాముల ఫీజు మాత్రం సుమారు.4,400 ఉందని అధ్యాపకులు తెలిపారు. అయితే దీనిపై యూనివర్సిటీ అధికార యంత్రా ంగం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఫీజు పెంపు నిర్ణయం విద్యను ప్రైవేటీకరణ, వ్యాపారీకరణ చేయడమేనని డెమొక్రటిక్ టీచర్స్ ఫ్రంట్ విమర్శించింది. ఫీజు పెంపును నిరసిస్తూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కు లేఖ రాసింది. పెంచిన ఫీజు కూడా ఒక్క రోజులోనే చెల్లించాలని యూనివర్సిటీ కోరినట్టు విద్యార్థులు తెలిపారు.