కోల్కతా : నూపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలతో నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో బెంగాల్లో హింసాత్మక నిరసనలు కొనసాగాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ను ప్రయోగించి, చెదరగొట్టారు. సమాచారం ప్రకారం.. హౌరాలోని పంచ్లా బజార్ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నది. ఇక్కడ పోలీసులు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. హింసాకాండ నేపథ్యంలో హౌరాలోని జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ను విధించారు. ఈ నెల 15 వరకు అమలులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
హౌరా హింసాకాండపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ ప్రకటన విడుదల చేశారు. బీజేపీ చేసిన పాపాలకు సామాన్యుడు ఎందుకు శిక్ష అనుభవిస్తున్నాడు? హౌరా హింస వెనుక కొన్ని రాజకీయ పార్టీలున్నాయని ఆరోపించారు. రెచ్చగొట్టేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా.. శుక్రవారం సైతం కోల్కతాలో నిరసనలు కొనసాగాయి. ప్రార్థనల అనంతరం పలువురు ముస్లింలు ప్రదర్శన నిర్వహించారు. నూపుర్ శర్మను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే హౌరాలో నిరసనలు హింసాత్మకంగా మారాయి. ప్రార్థన అనంతరం నిరసన తెలుపిన పలువురు.. జాతీయ రహదారి 116ను నిర్బంధించి.. నిప్పుపెట్టిన విషయం తెలిసిందే.
#WATCH | West Bengal: Fresh clash b/w Police & a group of protesters breaks out at Panchla Bazaar in Howrah. Police use tear gas shells to disperse them as protesters pelt stones
Violent protests broke out here y’day over controversial remarks of suspended BJP spox Nupur Sharma. pic.twitter.com/8ZhZ2bNVMG
— ANI (@ANI) June 11, 2022