గురుగ్రామ్, ఆగస్టు 13: హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం తమ వ్యవసాయ భూములను లాక్కొని నష్టపరిహారం ఇవ్వకుండా తమ కడుపు కొడుతున్నదని వేలాది మంది రైతులు రోడ్డెక్కారు. ఢిల్లీ-జైపూర్ ఎక్స్ప్రెస్వే వద్ద జాతీయ జెండాలు చేతపట్టుకుని రహదారిపై ట్రక్కులు, ట్రాక్టర్లు, బస్సులను రోడ్డుపై ఉంచి బైఠాయించారు. గంటపాటు రోడ్డు దిగ్బంధం చేశారు. కసన్, మొకల్వాస్, సెహ్రవాన్, చుట్టుపక్కల గ్రామాల్లో మొత్తం 1,810 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుని మార్కెట్ ధర కంటే తక్కువ మొత్తంలో నష్టపరిహారం ఇస్తున్నారని రైతులు చెబుతున్నారు.