న్యూఢిల్లీ: దేశ ఆస్తులను తన దోస్తులకు ప్రధాని మోదీ అమ్మేస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేయరా? అని ప్రశ్నించారు. ధరల పెరుగుదల, నిత్యవసర వస్తువులపై జీఎస్టీ పెంపు, నిరుద్యోగం వంటి సమస్యలపై కాంగ్రెస్ పార్టీ శుక్రవారం దేశ వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రపతి, ప్రధాని మోదీ నివాసాలకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు ప్రయత్నించారు. అయితే పోలీసులు వీరిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.
కాగా, పోలీస్ వాహనంలో కూర్చొన్న ప్రియాంక గాంధీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రతిపక్షాల గొంతును నొక్కేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ద్రవ్యోల్బణం గురించి కేంద్ర మంత్రులకు పట్టడం లేదని మండిపడ్డారు. అందుకే ధరల పెరుగుదలను చూపించేందుకు ప్రధాని మోదీ నివాసం, రాష్ట్రపతి భవన్కు ర్యాలీ తలపెట్టినట్లు తెలిపారు. జాతీయ ఆస్తులను తన దోస్తులకు ప్రధాని మోదీ అమ్మేస్తున్నారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. దీనిపై ఎందుకు దర్యాప్తు జరుగడం లేదు అని ప్రశ్నించారు.
మరోవైపు నేషనల్ హెరాల్డ్ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీని ప్రశ్నించింది. అలాగే హెరాల్డ్ భవనంలో కొంత భాగాన్ని సీజ్ చేసింది. ఈ నేపథ్యంలో జాతీయ ఆస్తులను తన స్నేహితులకు ప్రధాని మోదీ అమ్మేయడాన్ని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. దీనిపై దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
#WATCH | They (BJP) think Opposition can be muzzled. As their ministers can't see inflation, we want to show them inflation by marching towards PM house…PM Modi has handed over the assets of country to his friends:Congress General Secretary Priyanka Gandhi Vadra
(Source: AICC) pic.twitter.com/PWtH7EC2dI
— ANI (@ANI) August 5, 2022
हमारे नेता @RahulGandhi जी ने कहा तो था कल- "सच को बैरिकेड नहीं किया जा सकता है" और आज @priyankagandhi जी को पुलिस के बैरिकेड रोक नहीं पाए।#महंगाई_पर_हल्ला_बोल pic.twitter.com/OgLelTM5R8
— Congress (@INCIndia) August 5, 2022