న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఐసొలేషన్లో ఉన్నారు. ఆమె కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆదివారం కరోనా సోకింది. వ్యక్తిగత సిబ్బందిలో ఒకరికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో సోమవారం తాను కరోనా టెస్ట్ చేయించుకోగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని ప్రియాంక గాంధీ తెలిపారు. అయితే వైద్యుల సూచన మేరకు కొన్ని రోజులపాటు ఐసొలేషన్లో ఉంటానని చెప్పారు. వారి సలహా మేరకు కొన్ని రోజుల తర్వాత మరోసారి కరోనా టెస్ట్ చేయించుకుంటానని ఆమె వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్లో పేర్కొన్నారు.