న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: పార్లమెంట్ సాక్షిగా బీఎస్పీ ఎంపీ డానీష్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరిపై వచ్చిన ఫిర్యాదులను ప్రివిలేజ్ కమిటీకి పంపినట్టు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం తెలిపారు.
బీజేపీ ఎంపీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ అలీతో పాటు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి, డీఎంకే నేత కనిమొళి తదితరులు స్పీకర్ను డిమాండ్ చేశారు. దీంతో సంబంధిత ఫిర్యాదులను బీజేపీ ఎంపీ సునీల్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ప్రివిలేజ్ కమిటీకి పంపినట్టు స్పీకర్ చెప్పారు.