బెంగుళూరు: స్వదేశీయంగా తయారైన తేజస్ యుద్ధ విమానంలో ఇవాళ ప్రధాని మోదీ(PM Modi) విహరించారు. యుద్ధ పైలెట్ దుస్తుల్లో మోదీ .. సార్టీలు నిర్వహించారు. టూ సీటర్ ప్లేన్లో ఆయన ముందు సీటులో కూర్చున్నారు. బెంగుళూరులో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కంపెనీకి వెళ్లిన ఆయన లైట్ కంబాట్ ఫైటర్ విమానంలో ఎగిరారు. తేజస్ యుద్ధ విమానం సాధారణంగా సింగిల్ సీటర్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. కానీ ప్రధాని మోదీ మాత్రం ఇవాళ ట్విన్ సీట్ ట్రైనర్ వేరియంట్లో విహరించారు.
#WATCH | Prime Minister Narendra Modi flew a sortie on Tejas aircraft in Bengaluru, Karnataka, earlier today. pic.twitter.com/TNtWyHHDu9
— ANI (@ANI) November 25, 2023
భారతీయ వైమానిక దళం ఆ విమానాన్ని ఆపరేట్ చేసింది. ఇండియన్ నేవీ వద్ద కూడా ట్విన్ సీటర్ వేరియంట్ ఉంది. ఎయిర్ ఫోర్స్ వద్ద ప్రస్తుతం 40 తేజస్ ఎంకే-1 విమానాలు ఉన్నాయి. మరో 83 తేజస్ ఎంకే-1ఏ ఫైటర్స్ కోసం భారతీయ వైమానిక దళం డీల్ చేసుకున్నది. యుద్ధ పైలెట్ దుస్తుల్లో మోదీ .. సార్టీలు నిర్వహించారు. టూ సీటర్ ప్లేన్లో ఆయన ముందు సీటులో కూర్చున్నారు.