న్యూఢిల్లీ: భారత్ పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఇరు దేశాల ప్రధాన మంత్రులు, ప్రతినిధుల మధ్య 14వ వార్షిక శిఖరాగ్ర చర్చలు జరిగాయి. రెండు రోజుల భారత్ పర్యటన కోసం జపాన్ ప్రధాని కిషిడా ప్రత్యేక విమానంలో శనివారం ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆయనకు ఎయిర్పోర్ట్ వద్ద స్వాగతం పలికారు.
ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్కు చేరుకున్న జపాన్ ప్రధాని కిషిడాకు, ప్రధాని నరేంద్ర మెదీ స్వాగతం పలికారు. అనంతరం భారత్-జపాన్ మధ్య 14వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో ఇరు దేశ ప్రధానులు, ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్, జపాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఇండో-పసిఫిక్లో శాంతి, స్థిరత్వం, ఇరు దేశాల మధ్య సహకారంపై చర్చలు జరిపారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం గురించి కూడా చర్చించినట్లు సమాచారం.
కాగా, భారత్-జపాన్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇది మరో అడుగు అని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. శాంతి, శ్రేయస్సు, పురోగతికి ఈ భాగస్వామ్యం దోహదం చేస్తుందని పేర్కొంది.
భారత్, జపాన్ ప్రధానులు ఢిల్లీలో సమావేశం కావడం ఇదే తొలిసారి. భారత్, జపాన్ మధ్య చివరిసారి 2018లో టోక్యోలో శిఖరాగ్ర సమావేశం జరిగింది. అనంతరం 2019లో అప్పటి ప్రధాని షింటో అబే భారత్లో పర్యటించాల్సి ఉంది. అయితే పౌరసత్వ చట్టంపై అస్సాంలో నిరసనలు చెలరేగడంతో పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు.
2020, 2021లో కరోనా కారణంగా ఇరు దేశాల శిఖరాగ్ర సమావేశాలు జరగలేదు. అయితే టెలిఫోన్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరు దేశాల ప్రధానులు పలు అంశాలపై సంప్రదింపులు జరిపారు. జపాన్లో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఫుమియో కిషిడా ఆ దేశ ప్రధాని అయ్యారు. మరోవైపు ఈ ఏడాది శిఖరాగ్ర సమావేశానికి భారత్ అతిథ్యమిస్తున్నది.
#WATCH | Prime Minister Narendra Modi and Japanese PM Fumio Kishida hold the 14th Annual Summit, at Hyderabad House in Delhi.
"Another step toward advancing the India-Japan partnership – a partnership for peace, prosperity and progress!" says MEA pic.twitter.com/U3A2z89AEn
— ANI (@ANI) March 19, 2022
#WATCH | Japanese Prime Minister Fumio Kishida meets PM Narendra Modi at Hyderabad House in Delhi. pic.twitter.com/JUGj5NN5AX
— ANI (@ANI) March 19, 2022