బెంగళూరు: పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను కలిపి విక్రయించే విధానాన్ని సోమవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన బంకుల్లో ఈ పెట్రోల్ను విక్రయించారు. 2025 నాటికి దేశవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్నారు. పెట్రోల్ వాడకాన్ని, విదేశీ దిగుమతులను తగ్గించడం, పర్యావరణాన్ని కాపాడటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నది. దీంట్లో లీటరు పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ ఉంటుంది. గతంలో ఈ ఇథనాల్ మిశ్రమాన్ని 1.5 శాతం నుంచి 10 శాతానికి పెంచగా.. తాజాగా 20 శాతానికి పెంచారు.