న్యూఢిల్లీ: ప్రైమరీ డెంగ్యూ (మొదటిసారి సోకడం) కన్నా.. సెకండరీ డెంగ్యూ ఇన్ఫెక్షన్ చాలా ప్రమాదకరమన్న భావన ఇప్పటివరకు ఉంది, అయితే ఇది నిజం కాదని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. సెకండరీ డెంగ్యూ కన్నా..ప్రైమరీ డెంగ్యూ వైరస్ ఇన్ఫెక్షన్ అత్యంత ప్రమాదకరమని, దీనివల్లే మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని భారత్, అమెరికా సైంటిస్టుల సంయుక్త పరిశోధన తెలిపింది. చాలా వరకు డెంగ్యూ చికిత్స, వ్యాక్సిన్ల తయారీ, అభివృద్ధి అంతా కూడా సెకండరీ ఇన్ఫెక్షన్ చుట్టూనే తిరుగుతున్నదని, ఈ వ్యాధి పట్ల మన అవగాహనను మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని సైంటిస్టులు చెప్పారు.