న్యూఢిల్లీ: ఇంగ్లిష్, గుజరాతీ భాషల్లోని వార్తాపత్రికల ద్వారా బిల్కిస్ బానో దోషులకు బహిరంగ నోటీసులు జారీ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దోషులు వారి చిరునామాల్లో లేనందున నోటీసులు జారీ చేయలేకపోతున్నామంటూ వచ్చిన సమాచారం మేరకు జస్టిస్ జోసెఫ్తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. 2002లో బిల్కిస్ బానోను దుండగులు సామూహిక లైంగికదాడి చేయడమే కాక, ఆమె కుమార్తెతో పాటు ఏడుగురు కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేసిన విషయం విదితమే. ఈ కేసును జూలై 10కి వాయిదా వేసింది.