న్యూఢిల్లీ: రాష్ట్రపతి బాడీగార్డ్ గుర్రం విరాట్, ఇవాళ సర్వీస్ నుండి రిటైర్ అయ్యింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు చివరిసారి సేవలందించింది. అనంతరం బాడీగార్డ్ గుర్రం విరాట్కు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘనంగా వీడ్కోలు పలికారు. గత కొన్నేండ్లుగా అది అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. గుర్రం విరాట్కు ఈ ఏడాది చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్ మెడల్ కూడా లభించింది.
కాగా, ఢిల్లీలోని రాజ్పథ్లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. త్రివిధ దళాల విన్యాసాలు, పలు రాష్ట్రాల శకటాలు, పలు రకాల కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వైమానిక విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మరోవైపు సరిహద్దులలోని జవాన్లు మైనస్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో కూడా ఘనంగా రిబ్లిక్ డే వేడుకలను నిర్వహించారు. జాతీయ జెండాను రెపరెపలాడించి తమ దేశభక్తిని చాటారు.