న్యూఢిల్లీ: ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్ సిసికి రాష్ట్రపతిభవన్లో ఘటన స్వాగతం లభించింది. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీలు ఆయనకు స్వాగతలం పలికారు. రాష్ట్రపతి భవన్లో ఈజిప్టు అధ్యక్షుడికి సైనిక స్వాగతం లభించింది. గురువారం ఎర్రకోట వద్ద జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్కు ముఖ్య అతిథి పాల్గొనేందుకు ఈజిప్టు అధ్యక్షుడు ఇండియాకు వచ్చారు. అబ్దెల్ రాక చరిత్రాత్మకం కానున్నట్లు ప్రధాని మోదీ ఓ ట్వీట్లో తెలిపారు.
బుధవారం రాత్రే అబ్దెల్ సిసి ఢిల్లీకి చేరుకున్నారు. పలువురు కేంద్ర మంత్రు ఆయనకు విమానాశ్రయం వద్ద స్వాగతం పలికారు. ఈజిప్టుకు చెందిన ఉన్నతాధికారులు, అయిదుగురు మంత్రులతో పాటు అబ్దెల్ ఇండియాకు వచ్చారు. ఇండియాలో జరగనున్న జీ20 సమావేశాలకు ఈజిప్ట్ దేశాని కూడా ఆహ్వానం పంపారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రజలకు, ప్రభుత్వానికి ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ కంగ్రాట్స్ తెలిపారు. వైభవోపేతమైన జాతీయ దినోత్సవం రోజున జరిగే వేడుకులకు అతిథిగా రావడం గొప్పగా ఉందన్నారు. సమతుల్యం, సామర్థ్యం ఆధారంగా ఇండియా, ఈజిప్టు మధ్య సంబంధాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. రెండు దేశాల మధ్య నిర్మాణాత్మక ప్రగతి జరుగుతోందని, పాజిటివ్గా ముందుకు వెళ్తున్నట్లు ఆయన చెప్పారు.