తిరువనంతపురం: కేరళ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Murmu) ఇవాళ శబరిమలకు వెళ్తున్నారు. అయ్యప్ప స్వామిని ఆమె దర్శించుకోనున్నారు. అయితే ప్రమదం పట్టణంలో ఏర్పాటు చేసిన కాంక్రీట్ హెలిప్యాడ్లో.. ఆమె ప్రయాణించిన హెలికాప్టర్ వీల్ చిక్కుకున్నది. ప్రమదం పట్ణంలోని రాజీవ్ గాందీ ఇండోర్ స్టేడియం వద్ద నిర్మించిన హెలిప్యాడ్లో హెలికాప్టర్ దిగిన సమయంలో దాని చక్రం అందులో చిక్కుకున్నది.
చివరి నిమిషంలో హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం స్టేడియంను లొకేషన్గా మార్చినట్లు సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ప్రతికూల వాతావరణంలో వల్ల కొత్తగా మరో ప్రదేశంలో హెలిప్యాడ్ నిర్మించామన్నారు. పంబకు సమీపంలో ఉన్న నీలక్కల్లో తొలుత ల్యాండింగ్ ఏర్పాటు చేశామని, కానీ ప్రతికూల వాతావరణం వల్ల ల్యాండింగ్ ప్రదేశాన్ని ప్రమదంకు మార్చినట్లు ఆ ఆఫీసర్ వెల్లడించారు.
కొత్తగా హెలిప్యాడ్ను నిర్మించడం వల్ల.. దాని కోసం వేసిన కాంక్రీట్ ఇంకా ఆరలేదని, హెలికాప్టర్ బరువును అది తట్టుకోలేకపోయిందని పోలీసులు చెప్పారు. వీల్స్ తాకిన ప్రదేశంలో కాంక్రీట్ కుంగిపోయిందని, దీంతో వీల్స్ చిక్కుకుపోయినట్లు తెలిపారు.
మంగళవారం రాత్రి తిరువనంతపురంకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము ఇవాళ ఉదయం శబరిమలకు బయలుదేరి వెళ్లారు.ప్రమదం నుంచి రాష్ట్రపతి ముర్ము పంబ వరకు కాలినడకన వెళ్తున్నారు.
#WATCH | Kerala: A portion of the helipad tarmac sank in after a chopper carrying President Droupdi Murmu landed at Pramadam Stadium. Police and fire department personnel deployed at the spot physically pushed the helicopter out of the sunken spot. pic.twitter.com/QDmf28PqIb
— ANI (@ANI) October 22, 2025