న్యూఢిల్లీ: బ్రిటీష్ రాజ్యాధికారానికి చిహ్నాలుగా ఉన్న ఆనవాళ్లను ప్రభుత్వం తొలగిస్తున్నది. దీనిలో భాగంగా ఇవాళ ఎడ్విన్ లుటెన్స్ ప్రతిమను తొలగించి, దాని స్థానంలో తొలి గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి ప్రతిమను ప్రతిష్టించారు. రాష్ట్రపతిపభవన్ వద్ద చక్రవర్తి రాజగోపాలాచారి ప్రతిమను ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ఆవిష్కరించారు. అశోక మండపం వద్ద ఉన్న గ్రాండ్ ఓపెన్ స్టెయిర్కేస్ దగ్గర చక్రవర్తి రాజగోపాలాచారి బొమ్మను ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్ను నిర్మించిన ఎడ్విన్ లుటెన్స్ స్థానంలో రాజగోపాలాచారి ప్రతిమను ఓపెన్ చేశారు.
బ్రిటీష్ మైండ్సెట్ను పారద్రోలి, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేయనున్నట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మాట్లాడారు. రాజాజి ప్రతిమను ఆవిష్కరించడం అంటే.. బ్రిటీష్ పాలకుల ప్రభావాన్ని పారద్రోలడమే అవుతుందని అన్నారు. సీ రాజగోపాలాచారిని గుర్తు చేసుకోవడం అటే రాజాజి ఉత్సవాన్ని నిర్వహించడమే అన్నారు. బ్రిటీష్ ప్రాబల్యం నుంచి బయటపడే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. గులామీకి మనసిక్తా సే ముక్తి అన్న విజన్తో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇది ప్రభుత్వ సేవా భావనను ప్రతిబింబిస్తుందన్నారు.