భోపాల్: రాజ్యాంగ పరిధిలో పార్లమెంటుకు, రాష్ర్టాల శాసనసభలకు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమేనని జాతీయ ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్కుమార్ తెలిపారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై బుధవారం భోపాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జమిలి ఎన్నికలపై బదులిస్తూ.. ‘నిర్దేశిత సమయంలోపు’ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమేనని ప్రకటించారు. ‘ఈ-ఓటింగ్’పై ఇప్పటికిప్పుడు తుది నిర్ణయం తీసుకోలేమన్నారు.