లక్నో: బాతులను వేటాడేందుకు ఇద్దరు వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. అయితే పొరపాటున గర్భిణీ పొట్టలోకి బుల్లెట్లు దిగాయి. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆ మహిళతోపాటు ఆమె కడుపులోని శిశువు పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని మహోబాలో ఈ సంఘటన జరిగింది. 30 ఏళ్ల వందన గర్భవతి. భర్తతో కలిసి ఆమె పొలంలో పని చేస్తున్నది. కాగా, ఇద్దరు వ్యక్తులు నీలం బాతులను వేటాడేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో తమ వద్ద ఉన్న గన్తో ఆ బాతులపైకి కాల్పులు జరిపారు. అయితే పొలంలో పని చేస్తున్న గర్భిణీ పొట్టలోకి ఆ బుల్లెట్లు దిగాయి. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఇది చూసి ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, వందన అరుపులు విన్న భర్త భూపేంద్ర సింగ్ రాజ్పుత్ పరుగున ఆమె వద్దకు వచ్చాడు. తుపాకీ కాల్పుల్లో గాయపడిన భార్యను వెంటనే ఝాన్సీలోని జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. అయితే గర్భిణీతోపాటు ఆమె కడుపులోని బిడ్డ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
మరోవైపు వందన భర్త భూపేంద్ర సింగ్ రాజ్పుత్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నీలి బాతులను వేటాడుతూ పొరపాటున గర్భిణీపై కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.