న్యూఢిల్లీ: ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి సాంకేతిక కోర్సులు చేసిన వారిని అగ్నివీరులుగా నియమించేందుకు అగ్నిపథ్ పథకంలో సైన్యం పలు మార్పులు చేయనుంది. సాంకేతిక విభాగాల్లో అగ్నివీరులుగా ఐటీఐ, పాలిటెక్నిక్ చదివిన వారిని నియమిస్తే వారికి శిక్షణ కోసం వెచ్చించే సమయం తగ్గుతుందని ఆర్మీ భావిస్తున్నది. ఇందుకోసం వొకేషనల్ విద్య పూర్తి చేసిన వారికి అగ్నిపథ్ నియామక ప్రక్రియలో ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనుంది. తద్వారా మరింత మందికి అగ్నివీరులుగా నియమితులయ్యే అవకాశం కలగనుందని అధికారులు తెలిపారు.