అగర్తలా, జూలై 26: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) సభ్యులను త్రిపుర పోలీసులు అగర్తలాలోని ఓ హోటల్లో ఉంచి ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను అంచనా వేయడంలో భాగంగా 22 మందితో కూడిన ఐప్యాక్ బృందం గతవారం అగర్తలాలోని ఓ హోటల్లో దిగింది. అయితే, కొవిడ్-19 ఆంక్షల సమయంలో బయట తిరుగుతున్నారన్న కారణంతో వారిని ప్రశ్నించినట్టు పోలీసులు తెలిపారు. కాగా ఐ-ప్యాక్ టీమ్ను హోటల్లో ఏకపక్షంగా బంధించారని ఆరోపిస్తూ త్రిపురలోని తృణమూల్ పార్టీ నేతలు పోలీసుల చర్యలపై మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్కు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం తెలిసిందే.