హైదరాబాద్: దక్షిణ భారత దేశంలో విద్యుత్త వ్యవస్థ మరింత బలోపేతం అయ్యింది. తమిళనాడులోని పుగలూరు.. కేరళలోని త్రిసూర్ మధ్య వోల్టేజ్ సోర్స్ కన్వర్టర్(వీఎస్సీ) ఆధారిత హై వోల్టేజ్ డైరక్ట్ కరెంట్ సిస్టమ్(హెచ్వీడీసీ) పవర్లైన్ వాణిజ్య వినియోగం ప్రారంభమైంది. ఈ రెండు స్టేషన్ల మధ్య వీఎస్సీ పద్ధతిలో 2000 మెగా వాట్ల విద్యుత్తు సరఫరా కానున్నది. మోనోపోల్-2 ప్రాజెక్టును ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన ప్రధాని మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. మోనోపోల్-1 ఇప్పటికే పూర్తి స్థాయిలో కమర్షియల్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నది. పుగలూరు-త్రిసూరు మధ్య హెచ్వీడీసీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.5070 కోట్ల ఖర్చు అయ్యింది.
రాయిఘర్-పుగలూరు-త్రిసూర్ 6000 మెగావాట్ల హెచ్వీడీసీస వ్యవస్థలో భాగంగా మోనోపోల్-2ను ప్రారంభించారు. హెచ్వీడీసీ వ్యవస్థ ద్వారా కేరళకు రెండు వేల మెగా వాట్ల విద్యుత్తును అందించనున్నారు. అత్యాధునిక వీఎస్సీ టెక్నాలజీని పవర్గ్రిడ్ సంస్థ ఈ ప్రాజెక్టు ద్వారా ఇండియాలో ప్రవేశపెట్టింది. సాంప్రదాయహెచ్వీడీసీ వ్యవస్థతో పోలిస్తే వీఎస్సీ టెక్నాలజీకి అతి తక్కువ స్థాయిలో భూ వినియోగం అవసరం వస్తుంది. ఓవర్హెడ్ లైన్తో పాటు అండర్ గ్రౌండ్ కేబుల్ను ఏర్పాటు చేయడం ఈ వ్యవస్థలో ప్రత్యేకం. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగానే ఈ ప్రాజెక్టు అనేక స్వదేశీ కంపెనీలు విద్యుత్తు పరికరాలను సరఫరా చేశాయి.