రాయ్గడ: ఒడిశాలోని రాయ్గడలో రష్యాకు చెందిన ఎంపీ పావెల్ ఆంటోవ్ రెండు రోజుల క్రితం హోటల్లో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే. హోటల్ మూడవ అంతస్తు నుంచి కింద పడిపోవడం వల్ల ఆయన శరీరంలో గాయాలయ్యాని, వాటి వల్లే ఆయన మృతిచెందినట్లు పోస్టుమార్టమ్లో తేల్చారు. ఈ విషయాన్ని ఒడిశా పోలీసులు తెలిపారు. ఎంపీ ఆంటోవ్ మిత్రుడు వ్లాదిమిర్ బిడినోవ్ గుండెపోటుతో మృతిచెందినట్లు పోస్టుమార్టమ్లో తేలిందని పోలీసులు చెప్పారు. పోస్టుమార్టమ్కు చెందిన వివరాలను రాయ్గడ చీఫ్ జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లాల్మోహన్ రౌట్రాయ్ వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ విమర్శకుడైన ఆంటోవ్ మృతిచెందిన తీరు పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే.