షిల్లాంగ్, జూలై 7: ఫిర్యాదు తీసుకోలేదని ఆగ్రహించిన కొందరు పోలీస్ స్టేషన్పైనే దాడికి పాల్పడిన ఘటన మేఘాలయలో జరిగింది. లాయితుమ్ఖారా పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వర్గాలవారు గొడవపడ్డారు. ఒకరిపై మరొకరు అనుచిత వ్యాఖ్యలు చేసుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఫిర్యాదులను స్వీకరించలేదు.
దీంతో ఆగ్రహించిన రెండు వర్గాల్లోని కొంతమంది పోలీస్ స్టేషన్పై రాళ్లు రువ్వారు. అక్కడే ఉన్న మూడు వాహనాలు, ఓ బైక్కు నిప్పు పెట్టారు.