లక్నో: దొంగిలించిన డబ్బును చూసి దొంగలు మురిసిపోయారు. మంచంపై ఆ డబ్బును పరిచారు. (thieves flaunting stolen money) చెల్లాచెదురుగా పడి ఉన్న డబ్బును చూపిస్తూ ఇన్స్టాగ్రామ్ రీల్ చేశారు. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఒక దొంగ అరెస్ట్ అయ్యాడు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ సంఘటన జరిగింది. జ్యోతిష్కుడు తరుణ్ శర్మ ఇంట్లో ఇటీవల దొంగలుపడ్డారు. భారీగా డబ్బులు దోచుకున్నారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీలో రికార్డైన ఫుటేజ్ను కూడా అందజేశాడు.
కాగా, జ్యోతిష్కుడు తరుణ్ శర్మ ఇంట్లో చోరీపై పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగల ఆచూకీని గుర్తించలేకపోయారు. అయితే ఆ దొంగలు చోరీ చేసిన డబ్బును చూసి మురిసిపోయారు. ఆ నగదును మంచంపై పరిచి ఇన్స్టాగ్రామ్ రీల్ చేశారు. ఒక వ్యక్తి తన చేతిలో రూ.500 నోట్లు పట్టుకున్నట్టు ఆ వీడియో క్లిప్లో కనిపిస్తుంది.
మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో క్లిప్ పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో సాంకేతిక ఆధారాలతో ఒక దొంగ ఆచూకీని గుర్తించి అతడ్ని అరెస్ట్ చేశారు. రెండు లక్షల డబ్బుతోపాటు రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితుల కోసం ఆరా తీస్తున్నారు.
UP Kanpur : Thief spread bundles of stolen notes on the bed, posted video on Instagram.
-The police caught the accused thief through surveillance, after which around ₹ 200,000 cash and two phones were also recovered from him.https://t.co/Y2xlYc76og
— Mohd. Mobassir مبشر 🇮🇳 (@03_mobassir) October 5, 2023