న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: కండ్లలో కారం కొట్టి ఇద్దరు వ్యక్తుల నుంచి దాదాపు రూ.6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు దోచుకున్న ముగ్గురు దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే దుండగులు పేటీఎం ద్వారా చేసిన రూ.100 ట్రాన్సాక్షన్ వీరిని పట్టించింది.
ఓ సంస్థలో డెలివరీ బాయ్గా పనిచేసే సోమవీర్ ఢిల్లీలోని పహర్గంజ్లోని ఆఫీస్ నుంచి తన స్నేహితుడు జగదీప్ సైనీతో కలసి వెళ్తున్నారు. అయితే మార్గమధ్యలో వీరిని అడ్డుకున్న దుండగులు డెలివరీ బాయ్ కండ్లలో కారం కొట్టి వారి చేతిలో ఉన్న ఆభరణాల బ్యాగును తీసుకెళ్లిపోయారు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అయితే ఒక దుండగుడు ఓ క్యాబ్ డ్రైవర్తో మాట్లాడుతూ.. తాము టీ కొనుక్కునేందుకు రూ.100 నగదు తీసుకుని పేటీఎం ద్వారా అతడికి చెల్లించడంతో దొరికిపోయారు.