పాల్గర్: మహారాష్ట్రలో డబుల్ మర్డర్కు (Murder Accused)పాల్పడిన ఓ వ్యక్తిని బురద కుంటలో పట్టుకున్నారు. పాల్గర్లో ఇద్దర్ని హత్య చేసిన కిషోర్ కుమార్ మండల్ అనే వ్యక్తి.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సమీపంలో ఉన్న బురద కుంటలో దాక్కున్నాడు. అయితే మతి స్థిమితం తప్పిన ఆ వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు తెగించి పట్టుకున్నారు. ఆ బురద కుంటలోకి వెళ్లి అరెస్టు చేశారు. మతి స్థిమితం లేని నిందితుడు తన వద్ద ఉన్న గొడ్డలితో ఇద్దరు సీనియర్ సిటిజన్లను అటాక్ చేసినట్లు తేలింది. బోయిసర్ ఏరియాలోని కూడన్ విలేజ్లో ఈ ఘటన జరిగింది. సమీప అడవిలో ఉన్న బురద కుంటలో దాక్కున్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
#WATCH | Palghar, Maharashtra: Police arrested the double-murder accused Kishor Kumar Mandal from a nearby mud pond. https://t.co/kL8xEDjd7h pic.twitter.com/TxBiwMOHWr
— ANI (@ANI) March 1, 2024