న్యూఢిల్లీ, జూలై 24: ‘వనమహోత్సవం’ పేరిట తాము చేపట్టాలనుకున్న చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) హైజాక్ చేసిందని ఢిల్లీ పర్యావరణమంత్రి, ఆప్ నేత గోపాల్ రాయ్ ఆరోపించారు. సామాజిక ప్రయోజనాలకు ఉద్దేశించిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాజకీయ రంగు పులిమిందని మండిపడ్డారు. ఢిల్లీలోని అసోలా వైల్డ్లైఫ్ శాంక్చువరీలో ‘వనమహోత్సవ్’ పేరిట చెట్లు నాటే కార్యక్రమాన్ని ఆదివారం ఆప్ సర్కారు ప్రారంభించాల్సి ఉన్నది.
ఈ క్రమంలో కార్యక్రమానికి సంబంధించిన ప్రచార చిత్రం (బ్యానర్)పై కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనా ఫొటోలను ముద్రించాలని ఢిల్లీ సర్కారు అధికారులను ఆదేశించింది. అయితే ఆఖరి నిమిషంలో ఆ బ్యానర్ను మార్చిన ఢిల్లీ పోలీసులు.. ప్రధాని మోదీ ఫొటోను కూడా అందులో చేర్చారు.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేజ్రీవాల్, రాయ్ ఆ కార్యక్రమానికి హాజరుకాలేదు. కాగా, కేజ్రీవాల్ సర్కారు తీసుకొచ్చిన నూతన ఎక్సైజ్ పాలసీలో లొసుగులు ఉన్నాయని, దీనిపై దర్యాప్తు చేపట్టాలని ఇటీవల సీబీఐకి సూచించడం తెలిసిందే.