న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కొవిడ్-19 పరిస్థితిపై అత్యున్నత సమీక్షా సమావేశంలో పాల్గొనాల్సి ఉన్నందున పశ్చిమ బెంగాల్ లో శుక్రవారం జరిగే ఎన్నికల ర్యాలీలకు తాను హాజరు కావడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కరోనా మహమ్మారిపై అత్యున్నత భేటీకి అధ్యక్షత వహించాల్సి ఉందని, దీంతో పశ్చి బెంగాల్ పర్యటనకు వెళ్లడం లేదని మోదీ ట్వీట్ చేశారు.
కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో పలు రాష్ట్రాల్లో ఆరోగ్య మౌలిక వసతులపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి పరిమిత లాక్డౌన్, కర్ఫ్యూల వంటి కఠిన నియంత్రణలు అమలవుతున్నాయి.