న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ప్రధాని మోదీ(PM Modi-Bill Gates) చర్చలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ నివాసంలో ఆ చర్చా కార్యక్రమం జరిగింది. కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) నుంచి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాతావరణ మార్పులు లాంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఆ చర్చలో భారతీయలను బిల్ గేట్స్ ప్రశంసించారు. టెక్నాలజీని భారతీయుల చాలా వేగంగా ఆపాదించుకున్నారన్నారు. సాంకేతిక రంగంలో భారత్ దూసుకెళ్తున్నట్లు కూడా గేట్స్ తెలిపారు. పీఎం నమో యాప్లో ఉన్న ఫోటో బూత్ ఆప్షన్ ద్వారా బిల్ గేట్స్తో ప్రధాని సెల్ఫీ దిగారు.
డిజిటిల్ విప్లవంలో ఇండియా వేగంగా ముందుకు వెళ్తోందని, ఆరోగ్యం, వ్యవసాయం, విద్యా రంగాల్లో కూడా భారత్ ముందుకు వెళ్తోందని మోదీ అన్నారు. ఇండోనేషియాలో జీ20 శిఖరాగ్ర సదస్సు జరిగిన సమయంలో భారత్లో జరుగుతున్న డిజిటల్ విప్లవం గురించి ప్రపంచ దేశాలు తమ ఉత్సుకతను ప్రదర్శించాయని, అయితే ఏకఛత్రాధిపత్యాన్ని నిర్మూలించేందుకు టెక్నాలజీని ప్రజాస్వామ్యంగా మార్చామని ఆ సదస్సులో చెప్పినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ప్రజల చేత, ప్రజల కోసం టెక్నాలజీని అందిస్తున్నామన్నారు.
జీ20 సదస్సు సమగ్ర స్థాయిలో జరిగిందని, ఇండియా ఆ సదస్సును అద్భుతంగా నిర్వహించిందని బిల్ గేట్స్ పేర్కొన్నారు. భారత్లో డిజిటల్ విభజన జరగకుండా చూస్తానని, డిజిటల్ మౌళిక సదుపాయాల్ని ప్రతి గ్రామానికి తీసుకువెళ్తానని ప్రధాని మోదీ అన్నారు.
#WATCH | As PM Narendra Modi and Bill Gates talk about the digital revolution in India, the PM also tells him about ‘Namo Drone Didi’ scheme
PM says, “When I used to hear about the digital divide in the world, I used to think that I would not allow anything like that to happen… pic.twitter.com/ib79pnc2sB
— ANI (@ANI) March 29, 2024
కోవిడ్ కట్టడిలో భారత్ పాత్రను ప్రధాని మోదీ.. బిల్ గేట్స్కు వివరించారు. డిజిటల్ రంగంలో భారత్ చాలా మార్పులు తీసుకువచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు. విద్యారంగంలో మార్పులకు టెక్నాలజీ వినియోగిస్తున్నామన్నారు. జీ20 సదస్సులో ఏఐ వినియోగించామన్నారు. టెక్నాలజీ అలసత్వానికి దారి తీయవద్దు అని పేర్కొన్నారు. ప్రభుత్వం అవసరం ఉన్న పేదలకు టెక్నాలజీ ఉపయోగపడుతుందన్నారు. టెక్నాలజీ వల్ల పేదలకు అన్నీ అందుతున్నాయన్నారు. చిరుధాన్యాల సాగుతో చిన్న రైతులు అభివృద్ధి చెందతున్నారని తెలిపారు. పెద్ద హోటళ్లలోనూ చిరుధాన్యాల వంటకాలు పెరిగాయన్నారు.
ప్రజల్లో విశ్వాసం, చైతన్యం నింపే అనేక కార్యక్రమాలు చేపట్టామని ప్రధాని మోదీ తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్పై అపోహలు, అనుమానాలు నివృత్తి చేశామన్నారు. తన తల్లితో కలిసి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. నమో డ్రోన్ దీదీ పథకం సక్సెస్ఫుల్గా అమలు అవుతోందన్నారు.
స్కూల్ టీచర్ల కొరతను అధిగమించేందుకు ఏఐను వాడుతున్నామన్నారు. డిజిటల్ మార్పులతో దేశానికి ప్రయోజనం జరిగిందని మోదీ అన్నారు.
#WATCH | PM Narendra Modi and Bill Gates discuss the role and benefits of technology and Artificial Intelligence (AI). The PM also tells him how AI was utilised during 2023 G20 Summit, how his Hindi speech was translated into Tamil during Kashi Tamil Sangamam event and the use of… pic.twitter.com/Ur5eUkC7Gs
— ANI (@ANI) March 29, 2024