Hindhu temple: ప్రస్తుతం యూఏఈ, ఖతార్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ యూఏఈ రాజధాని అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ ఆలయాన్ని భారీ విస్తీర్ణంలో నిర్మించారు. ఇది పశ్చిమాసియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గుర్తింపు పొందింది.
కాగా యూఏఈ, ఖతార్ పర్యటనల కోసం ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం భారత్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. మంగళవారం సాయంత్రం అబుదాబికి చేరుకున్న వెంటనే యూఏఈ అధ్యక్షడు మహ్మద్ బిన్ జాయేద్తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం మహ్మద్ బిన్ జాయేద్తో కలిసి మోదీ.. యూఏఈలో యూపీఐ రూపే కార్డు సేవలను ప్రారంభించారు.
ఇవాళ యూఏఈ పర్యటన ముగించుకుని ప్రధాని ఖతార్కు వెళ్లనున్నారు. ఖతార్లో కూడా పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం పర్యటన ముగించుకుని భారత్కు చేరుకోనున్నారు.