దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి గురించి ప్రస్తావించారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని.. మాస్క్ విధిగా ప్రతిఒక్కరు ధరించాలని సూచించారు. తరుచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ను ఎదుర్కొనేందుకు దేశం సంసిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే భారత్లో 18 లక్షల ఐసోలేషన్ బెడ్స్ ఉన్నాయన్నారు. 5 లక్షల ఆక్సీజన్ సపోర్టెడ్ బెడ్స్, 1.40 లక్షల ఐసీయూ బెడ్స్, 90 వేల పీడియాట్రిక్ ఐసీయూ, నాన్ ఐసీయూ బెడ్స్ సిద్ధంగా ఉన్నాయన్నారు. 3000 కంటే ఎక్కువ పీఎస్ఏ ఆక్సీజన్ ప్లాంట్స్, 4 లక్షల ఆక్సీజన్ సిలిండర్స్ను దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేసినట్టు మోదీ స్పష్టం చేశారు.