న్యూఢిల్లీ, జనవరి 10: కాశీ విశ్వనాథ్ ధామ్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వంద జనపనార చెప్పుల జోళ్లను పంపించారు. ఆలయ పరిసరాల్లో రబ్బరు, తోలు చెప్పులు ధరించడాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. పూజారులు, సేవకులు, సెక్యూరిటీ గార్డులు, పారిశుద్ధ్య కార్మికులు చెప్పులు లేకుండా చలికాళ్లతో విధులు నిర్వర్తిస్తున్నారని తెలుసుకున్న ప్రధాని.. జూట్ చెప్పులను పంపించినట్టు ప్రభుత్వ వర్గాలు సోమవారం తెలిపాయి.