న్యూఢిల్లీ : ప్రపంచ సుస్ధిరతకు భారత్-సౌదీ భాగస్వామ్యం (India-Saudi Partnership) కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జీ-20 సదస్సు నేపధ్యంలో భారత్ పర్యటనకు వచ్చిన సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ సోమవారం ప్రధాని మోదీతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో సమావేశమయ్యారు.
ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పలు అంశాలపై సంప్రదింపులు జరిపారు. 2019లో రియాద్లో ఇరు దేశాలు సంతకం చేసిన ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా వ్యూహాత్మక భాగస్వామ్య మండలి తొలి భేటీకి హైదరాబాద్ హౌస్ వేదికైంది. భారత్కు సౌదీ అరేబియా కీలక, అతిపెద్ద వ్యూహాత్మక భాగస్వామి అని మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాల భాగస్వామ్యం ఈ ప్రాంతంతో పాటు ప్రపంచ సుస్ధిరత, సంక్షేమానికి కీలకమని వ్యాఖ్యానించారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా తమ సంబంధాల్ఓలో నూతన ఒరవడిని తీసుకువస్తామని, తమ భాగస్వామ్యన్ని తదుపరి దశకు తీసుకువెళ్లేందుకు అవసరమైన చర్యలను గుర్తించామని చెప్పారు. వ్యూహాత్మక భాగస్వామ్య మండలిలోని పలు ఉన్నతస్ధాయి కమిటీల పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా ఇరువురు నేతలు చర్చలు జరిపారు.బ్రిక్స్లో సౌదీ అరేబియా పూర్తిస్ధాయి సభ్యత్వం పొందినందుకు మహ్మద్ బిన్ సల్మాన్ను ప్రధాని మోదీ అభినందించారు.
Read More :