జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్బర్గ్ (Johannesburg) వేదికగా బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సమావేశాలు (BRICS Summit) జరుగుతున్నాయి. ఈ సమ్మిట్కు భాగస్వామ్య దేశాధినేతలతోపాటు ప్రధాని మోదీ (PM Modi) కూడా హాజరయ్యారు. ఇందులో భాగంగా దక్షిణాఫ్రికా (South Africa) అధ్యక్షుడు సిరిల్ రమాఫోసాతో (Cyril Ramaphosa) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య దైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అనంతరం ఫొటో షూట్ (Photo shoot) కోసం ఇద్దరు నేతలు ఫోజులిచ్చారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకున్నది.
ఫొటోలకు పోజులివ్వడానికి ఇరువురు నేతలు అక్కడే ఏర్పాటు చేసిన వేదికపైకి వస్తున్నారు. దీంతో ఎవరు ఎక్కడ నిల్చోవాలని సూచిస్తూ.. నిర్వాహకులు ఆ స్టేజిపై ఇరు దేశాల జాతీయ జెండాలను (Country’s flag) ఉంచారు. వేదికపైకి వస్తూనే దానిని గమనించిన ప్రధాని మోదీ.. తాను నిలబడాల్సిన చోట ఉన్న త్రివర్ణ పతాకాన్ని (Indian flag) తీసి తన జేబులో (Pocket) వేసుకున్నారు. దీంతో అప్పటికే తమ దేశ పతాకంపై నిలబడిన రమాఫోసో సైతం ఆ జెండాను తీసి అక్కడే ఉన్న ఓ అధికారికి ఇచ్చారు. అయితే భారత దేశ జెండాను ఇవ్వాల్సిందిగా అతడు మోదీని కోరడంతో.. దానిని తనవద్దే పెట్టుకుంటానంటూ చెప్పేశారు. ఈ వీడియోను ప్రధాని కార్యాలయం సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేసింది. దీంతో ఇది సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నది.
#WATCH | Johannesburg, South Africa | PM Narendra Modi notices Indian Tricolour on the ground (to denote standing position) during the group photo at BRICS, makes sure to not step on it, picks it up and keeps it with him. South African President Cyril Ramaphosa follows suit. pic.twitter.com/vf5pAkgPQo
— ANI (@ANI) August 23, 2023