న్యూఢిలీ: 60 ఏండ్లుగా న్యాయం, సత్యానికి బ్రాండ్ అంబాసిడర్గా సీబీఐ నిలిచిందని ప్రధాని మోదీ ప్రశంసించారు.
సీబీఐ వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని సోమవారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశంలో అవినీతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలన్న రాజకీయ సంకల్పానికి కొరత లేదని, అవినీతిపరులు ఎంత శక్తివంతులైనా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.