Modi Congrats to Shehbaz | దక్షిణాసియాను ఉగ్రవాద రహిత ప్రాంతంగా తీర్చి దిద్దాలని, ఈ రీజియన్లో శాంతి సుస్థిరతలు నెలకొల్పాలని భారత్ కోరుకుంటున్నదని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. కొత్తగా ఎన్నికైన పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ను అభినందించారు. ఈ మేరకు సోమవారం రాత్రి ట్వీట్ చేశారు. ఇరుదేశాల ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి సవాళ్లపై దృష్టి పెట్టాలన్నారు.
పాక్లో రాజకీయ హై డ్రామా మధ్య ఇమ్రాన్ఖాన్ ప్రధానిగా వైదొలగడం.. షహబాజ్ షరీఫ్ ఎన్నికవ్వడం వెంటవెంటనే జరిగాయి. పాక్ ప్రధానిగా ఎన్నికవ్వగానే షహబాజ్ షరీఫ్.. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. కశ్మీర్కు 370 అధికరణాన్ని రద్దు చేయడాన్ని తప్పు బట్టారు. పాక్ లేకుండా కశ్మీర్ అంశానికి పరిష్కారం లభించబోదని చెప్పారు. భారత్తో మంచి ద్వైపాక్షిక సంబంధాలనే కోరుకుంటున్నామని అన్నారు.