న్యూఢిల్లీ: ప్రజలందరికి ప్రధాని మోదీ (PM Modi) భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక పండుగ మన సమాజంలో అనందమయ స్ఫూర్తిని నింపాలని ఆకాంక్షించారు. అందరికీ మంచి ఆరోగ్యం, శ్రేయస్సు చేకూరాలని ప్రార్థిస్తున్నాని ట్వీట్ చేశారు.
‘అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక పండుగ మన సమాజంలో ఆనందమయ స్ఫూర్తిని పెంపొందింపజేయుగాక. అందరికీ మంచి ఆరోగ్యం, శ్రేయస్సు చేకూరాలని ప్రార్థిస్తున్నాను.’ అని ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.