తొలి టీకాలు వైద్యులు, సిబ్బందికి వేయటంపై ప్రధాని వ్యాఖ్య
న్యూఢిల్లీ, మే 17: కరోనా సంక్షోభం వేళ దేశంలో వైద్య సిబ్బంది చేస్తున్న సేవలు నిరుపమైనవని ప్రధాని మోదీ అన్నారు. టీకాలను తొలుత వైద్యులు, వైద్యసిబ్బందికి వేయటమనే వ్యూహం సత్ఫలితాలనిస్తున్నదని తెలిపారు. సోమవారం దేశంలోని వైద్యులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో వైద్యరంగంలో ఉన్నవారిలో ఇప్పటికే 90 శాతం సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ మొదటి డోసును అందజేశామని చెప్పారు. కరోనా కట్టడిలో ఎంబీబీఎస్ విద్యార్థులు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. దవాఖానలలో ఉండే ఆక్సిజన్ నిల్వలపై నిత్యం ఆడిట్ చేయాలని ఆయన వైద్యులకు సూచించారు.